ధర్మపురి
సీత దహనానికి 18 సంవత్సరాల క్రితం...
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి ఆరు నెలలు కావస్తోంది. బ్రిటిష్వారు ఇంకా దేశాన్ని పూర్తిగా విడిచి వెళ్ళకపోయినా, వారి అధికార కోరలు పీకేయడంతో ఎవరికీ వారి పట్ల భయం లేదు, బెరుకూ లేదు. దేశంపై ఎందరో దండెత్తినా, ఎవరి ఆధిపత్యానికీ తలొగ్గకుండా, అడవి మాటున, సముద్ర తీరానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు నిగూఢంగా మనుగడ సాగిస్తోంది. అదే 'ధర్మపురి'.
ధర్మపురికి దక్షిణాన ఒక పెద్ద శివాలయం. ఉత్తరాన ఒక వేశ్యల వీధి. దాన్ని ఆనుకొనే ఒక స్మశానం. వేశ్యల వీధి భౌగోళికంగా ఆ ఊరిలో భాగమే అయినా, ఆ ఊరికీ, ఆ వీధికీ అస్సలు సంబంధమే లేనట్టు ప్రవర్తిస్తుంటారు అక్కడి జనాలు. కానీ, ఆ కట్టుబాట్లన్నీ పగటి వేషాలు మాత్రమే! చీకటి మాటున, వెన్నెల వెలుగులో పగటి నీతులు గాలిలో కలిసిపోతాయి. ఊరిపెద్ద కళ్లుగప్పి, కంచె దాటి, సూర్యుడు ఉదయించేలోపే తిరిగి గుట్టుచప్పుడు కాకుండా గూటికి చేరుకుంటారు చాలామంది.
అసలు ఆ ఊరికీ, ఆ వీధికీ మధ్య కంచె ఏర్పడటానికి కారణం ఒక స్వామీజీ. వేశ్యలు ఊరికి అపశకునాలని, వారిని పొలిమేరల్లోకి రానివ్వకూడదని, కొన్నేళ్ల క్రితం ఆ ప్రాంతాన్ని ఏలిన రాజుని నమ్మించి ఆ కంచె వేయించాడు. అప్పటి నుంచి........................