గోదావరి ప్రవాహం
ప్రొ. జి.హరగోపాల్
డా. సంధ్య విప్లవ్ గారి ఈ సుధీర్గ కవిత కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్న ఒక నదీ ప్రవాహంలా ఉంది. బహుశా పోలవరం ఆ మాటకు వస్తే ఏ పెద్ద ప్రాజెక్ట్ పైన ఐనా ఇంట ఆవేశంగా వ్రాయబడ్డ కవితలు చాలా అరుదు. నాగార్జున సాగర్ కట్టినప్పటి నుండి ప్రాజెక్ట్ ల మీద కవితలు ఒస్తూనే ఉన్నాయి. కానీ అప్పటి ప్రాజెక్ట్ల మీద ఒచ్చిన కవితలు ఆనకట్టలను ఆహ్వానిస్తూ, ఆనందిస్తూ వ్రాసినవి. కృష్ణ గోదావరి నదుల మీద ఆనకట్టలు కట్టిన సర్. ఆర్థూర్ కాటన్కు విశ్రామమే కట్టించారు. కానీ రాను రాను పేద ప్రజల జీవితాలను మారుస్తారన్న
ఈ "ఆధునిక దేవాలయాలు" ప్రజల కొంప ముంచడం వలన ప్రాజెక్ట్ల పట్ల అవగాహన మారుతూ ఒచ్చింది. ఆర్.ఎస్. రావు గారు ఒక విశ్లేషణలో "ఆధునిక దేవాలయాలు” అన్న వర్ణన సరిఐనదేనని హిందు దేవాలయాలలో దళితులకు, పేదలకు ఎలా ప్రవేశం లేదో అలాగే ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి ఫలాలకు పేదలు దూరంగానే ఉన్నారు. దూరమే కాదు, ఉన్న ఇల్లు, భూమి, తట్ట, బుట్ట అన్నీ మునిగి పోవడంతో వాళ్ళు నిరాశ్రయులుగా నిర్వాసితులుగా మిగిలిపోయి కుటుంబాలకు కుటుంబాలు విచ్చిన్న మయి పోయాయి. ఈ అనుభవంతో భారీ ప్రాజెక్ట్లకు వ్యతిరేకంగా ప్రజలు
దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టారు. ఈ పరంపరలో ముందుకు వచ్చిన పోలవరం కట్టడం పట్ల కూడా విశ్వ వ్యతిరేకత వ్యక్తమౌతున్నది...........................