ఇది కేవలం ఆరంభం మాత్రమే...
- ఎం.ఎ.బేబీ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు, యువత సాధించిన విజయం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి నిరంకుశ పాలన అంతానికి ఇది ఆరంభాన్ని సూచిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన విజయోత్సవ ప్రసంగంలో పేర్కొన్నట్లుగా, మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీసి, సిజెపి ఆవిర్భావానికి కారణమయ్యాయి. మొదట ఆన్లైన్లో వ్యక్తమైన యువత, విద్యార్థుల ఆగ్రహం నీట్ పేపర్ లీక్ కావడం, దాని పర్యవసానంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో వీధుల్లోకి వెల్లువెత్తింది.
ప్రభుత్వ అణచివేతను అధిగమించడం
ఈ నిరసనను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం రకరకాల మార్గాలను ఎలా ఉపయోగించిందో ప్రపంచమంతా చూసింది. నిరసన జరుగుతున్న ప్రదేశం, దాని పరిసర ప్రాంతాలలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పార్లమెంట్ మార్చ్ రోజున వేలాదిగా జంతర్ మంతర్ దగ్గరకు చేరుకున్న విద్యార్థులు, యువతపై పోలీసులు దారుణంగా దాడి చేసి, వేదికను ధ్వంసం చేశారు. పాలకులే హింసను ప్రేరేపించినప్పటికీ కేసులు మాత్రం నిరసనకారులపై బనాయించారు. అయినా సరే వెరవకుండా నిరసనకారులు మరుసటి రోజే మళ్లీ భారీ సంఖ్యలో తిరిగొచ్చారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రయాణాలపై ఆంక్షలు విధించినా, ముఖ్యంగా మెట్రో స్టేషన్లను మూసివేసినా, జంతర్ మంతర్ వద్ద గుమిగూడారు.
వాస్తవానికి, ఢిల్లీ నిరసనకు మద్దతుగా దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. నిరసనకారులకు
జంతర్ మంతర్ విద్యార్థి, యువజనులు పోరాటం.......................