అడవి మొగ్గల వాన గోరటి వెంకన్న
డవి మొగ్గల వాన.. చెంచు గిరుల కోన, కారుకోడి పదును, బ్రహ్మనాయుడి కదును కథావరణంలోకి మనలను అలవోకగా తీసుకుపోయే నవల ఇది. అడవిని ఆలంబన చేసుకొని, తనే ఒక ఆదివాసిగా మారి చెంచుల జీవితాన్ని చిత్రిక పట్టిన తొట్ట తొలి చారిత్రక నవల. రచనా మౌలిక తత్వాన్ని ఆకళింపు చేసుకున్న, గతాన్ని తొవ్వి ఉన్నవి, విన్నవి, వర్తమాన అధ్యయనంలో కన్నవి, ఎరుకపడినవి అన్నింటిని కుప్ప పోసి ఉద్వేగ భరిత శైలితో ప్రాణప్రతిష్ట చేసిన నవలే కొండమల్లు.
"పోసగు ముత్యపు సరులు మోహరించిన రీతి తమలోన దొరలు శబ్దముల” గూర్చి (పింగళి సూరన) అల్లిన గాథ ఇది. అడవిలో కృతక విలాసాలు ఉండవు. కానీ ఆహ్లాదమంత అడవి ఒడిలోనే ఉన్నదన్నంత గొప్పగా ఉంటుంది. ఋతువు ఋతువుకు మారే అడవి అందాలుంటాయి. ఎగిరే ఎన్నో పిట్టలు తమ భాషలో శబ్దం నొంపుతూ మనలను మురిపెంగా పలకరిస్తాయి. ఎన్నో పాకే చెట్ల తీగలు లేత మునివేళ్ళతో మనల్ని తడుముతాయి. పుటల నిండా పరుచుకున్న అడవి చెట్ల పుప్పడి సుగంధం మనల మరో లోకం మైకంలోకి తీసుకు వెళ్తుంది. ఆధునిక జీవన అవిటి తనాన్ని వెనుకకు నెట్టే శక్తి గల అక్షర పొదుగు ఈ నవల.. పసరుటాకుల నులి స్పర్శ, దేహ మాలిన్యాన్ని తొలగించే కొండ పసుపు ఇది. అలసటను మరిపించే ఇప్పపూల. అమ్మ సిరుల సామ్రాజ్యపు ఒద్దిమాను బండాగారమిది................................