పరిచయం
ఒంటరిగా, సింహం గుహలోకి
20 జరిగిన భీకరమైన పేలుడు పదిహేడు మంది రెవల్యూషనరీ గార్డ్స్ ను 11 నవంబర్ 12న, టెహ్రాన్ సమీపంలోని ఒక రహస్య క్షిపణి స్థావరంలో హతమార్చింది, అలాగే డజన్ల కొద్దీ క్షిపణులను ఇనుప కుప్పలుగా మార్చింది. ఈ ఘటనలో జనరల్ హసన్ టెహ్రానీ మొఖుద్దం, షెహాబ్ దీర్ఘశ్రేణి క్షిపణుల "పితామహుడు, "ఇరాన్ క్షిపణి కార్యక్రమానికి ప్రధాన బాధ్యత వహించిన వ్యక్తి, మరణించాడు. కానీ ఈ పేలుడు అసలైన లక్ష్యం మొఖుద్దం కాదు. దాని లక్ష్యం ఘన ఇంధన రాకెట్ ఇంజిన్ (సాలిడ్ ఫుయల్ రాకెట్ ఇంజిన్) — దీని సామర్థ్యం 6,000 మైళ్లు దాటి ఇరాన్ భూగర్భలోని బంకర్ లో నిక్షిప్తం చేసిన క్షిపణుల ప్రదేశం నుండి అమెరికా ప్రధాన భూభాగానికి అణు క్షిపణిని మోసుకెళ్లడం.
ఇరాన్ నాయకుల రూపకల్పన చేసిన ఈ కొత్త క్షిపణి ద్వారా అమెరికాలోని ప్రధాన నగరాలను తమ అధీనంలోకి తెచ్చుకుని, ఇరాన్ ను ప్రపంచంలో ప్రబల శక్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో తయారుచేశారు. అయితే, నవంబర్ లో జరిగిన పేలుడు కారణంగా ఈ ప్రాజెక్టును కొన్ని నెలల పాటు నిలిపివేయడం జరిగింది.
కొత్త దీర్ఘశ్రేణి క్షిపణి లక్ష్యం అమెరికా అయినప్పటికీ, ఇరానియన్ స్థావరాన్ని నాశనం చేసిన పేలుళ్ల ప్రణాళికను రచించి, అమలు చేసింది మాత్రం ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్. ప్రారంభించినప్పటి నుండి 60 ఏళ్లుగా, మొసాద్ ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలకు పొంచి ఉన్న ముప్పును ధైర్యంగా, రహస్యంగా ఎదుర్కొంటూ తన సేవలందిస్తోంది. ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఎక్కువగా, మొసాద్ గూఢచారి కార్యకలాపాలు, సమాచార సేకరణ అమెరికా భద్రతపై అంతర్జాతీయ స్థాయిలో, అలాగే స్వదేశంలో కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి............................