కొన్ని చోట్ల కదళీపాకంతో , మరి కొన్ని చోట్ల ద్రాక్షాపాకంతో ప్రసిద్ధి సుకుమార సుందర పదాలతో , ఆశ్లేషించి ఒకే పదంలా భాసించే సమాసాలతో , మధుర భావాలతో వెలుగొందే కృతి మళ్ళి చదవాలనిపిస్తుంది. ఇందులో "ఎచట చూచిన అద్భుతమే", కవయిత్రి కల్పన "నిత్యా నూతన దర్శనమే". డాక్టర్ శోభాదేవి గారి ఈ గేయ కావ్యం సహృదయులకు సద్య:పర నిర్వృతి నేపథ్యం చేస్తుంది.