శిశిరం దాటిన వసంతం
ఫోన్లో ఆడబడుచు భర్త రామారావు స్వరం వినగానే అహల్య "అన్నయ్యగారూ! కులాసాగా వున్నారా?" అనడిగింది వినమ్రంగా.
"బాగానే వున్నానమ్మా! ఇప్పుడే మీ ఆయనతో మాట్లాడాను. నువ్వు, అతను మా ఇంటికి రండి. ముఖ్యమైన విషయం మాట్లాడాలి."
“అలాగేనండి" ఆయన ఫోన్ పెట్టేసాక అప్పుడే పూజ ముగించి బయటకొచ్చిన భర్తతో విషయం చెప్పింది.
"అవును. మా బావగారు ఫోన్ల్చేసి మనిద్దరినీ వాళ్లింటికి రమ్మన్నారు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలిట" అన్నాడు ఈశ్వరప్రసాద్.
ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ తిన్నాక, ఆమె వంటమనిషికి ఏం వండాలో పురమాయించింది. ఇద్దరూ బయలుదేరారు.
"రండి ఇవాళ ఏకాదశి. మంచిరోజు. మీతో మీ అమ్మాయి పెళ్ళి గురించి మాట్లాడాలని పిలిచాను" అన్నాడు రామారావు.
ఆయన "శైలజా! ఇలారా!" అని భార్యని పిలిచాడు.
ఆమె నవ్వుతూ తమ్ముడిని, మరదలిని పలుకరించింది.
రామారావు చెప్పాడు "కాశ్యప్కి మంచి ఉద్యోగం వచ్చిందోయ్!"
"అవునట. సునీత చెప్పింది" అన్నాడు ఈశ్వర్ ఈ ప్రస్తావన ఎటు దారితీస్తుందో వూహిస్తూ....................................