డా. రవీంద్రకుమార శర్మ
డా. రవీంద్రకుమార్ శర్మ 1952 సెప్టెంబరు 5వ తేదీన అదిలాబాదులో బనారసీలాల్ శర్మ, సోమవతి దంపతులకు జన్మించారు. అదిలాబాదులోని హిందీ హైస్కూలునుంచి మెట్రిక్యులేషనులో ఉత్తీర్ణులయ్యాక జె.ఎన్.టి.యు, హైదరాబాదునుంచి శిల్పకళలో డిప్లొమా చేసారు. ఆ తర్వాత బరోడాలోని మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయం నుంచి శిల్పకళలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. అందులో భాగంగా మెటల్ కాస్టింగ్లో స్పెషలైజేషన్ చేసారు.
బరోడాలో యూనివెర్సిటీతో సహా పలువురు శిల్పులు, సంస్థలు ఉన్నత ఉద్యోగాన్నిస్తామని ముందుకొచ్చినప్పటికీ, వాటిని తిరస్కరించి, బరోడా చదువు కొనసాగుతుండగానే అదిలాబాదులో ఉండే వృత్తిపనివారి కోసం 1979 జూన్ 7 వ తేదీన కళాశ్రమం ప్రారంభించారు. స్థానిక వృత్తిపనివారి సంక్షేమం, అభ్యుదయం, వారి పనితీరులో కొత్త పోకడల్ని ప్రోత్సహించడం కళాశ్రమం ఆశయాలు. అప్పణ్ణుంచీ ఆయన 2018 ఏప్రిల్ 29 వ తేదీన ఈ లోకం నుంచి సెలవుతీసుకునేదాకా, దాదాపు నాలుగు దశాబ్దాలు కళాశ్రమమే తన ఊపిరిగా జీవించారు. ఇప్పుడు వారి శ్రీమతి రాజశ్రీశర్మ, కుమారుడు అపూర్వశర్మ, కుమార్తె దివ్య కళాశ్రమ నిర్వహణ కొనసాగిస్తున్నారు.
డా.శర్మ రాతిశిల్పకళ, మినియేచర్ చిత్రకళ, దారు శిల్పకళ, లోహపు పోతపని, వడ్రంగం, కుమ్మరం లాంటి 14 శిల్పప్రక్రియల్లో నిష్ణాతులు. వాటిలో చాలావరకూ ఆయన స్వయంగా స్థానిక కళాకారులతో కలిసి నేర్చుకున్నారు. అదిలాబాదు చుట్టు.......................................