మధ్యతరగతి జీవితాలకు దర్పణం ఈ నవల
శీలా సుభద్రాదేవి నీడలచెట్టు నవలలో యువత జీవనసరళిలో, సమాజంలో, కుటుంబసభ్యుల ఆలోచనావిధానంలో వచ్చిన మార్పులు ఆవిష్కరించేరు. సుమారుగా 20వ శతాబ్దం నాలుగో పాదంలో మధ్యతరగతి జీవితాలకి అద్దం పడుతుంది ఈ నవల.
అయితే మార్పు ఎప్పుడూ ఎక్కడినుంచో ఊడిపడదు. క్రమంగా ఒక ఇంకొక సమాజంలో కొత్తగా పాదుకొంటున్న భావజాలంమూలంగా ప్రభావితులై, తమజీవితాలను చక్కదిద్దుకోడంతో సమాజంలో మార్పు రూపు దిద్దుకుంటుంది. అంటే ఒకవిధంగా చెప్పాలంటే వ్యక్తిలో మార్పు, సమాజంలో మార్పూ కూడా పరస్పర దోహదకారులు. వ్యక్తివల్ల సమాజమూ సమాజంవల్ల వ్యక్తీ మార్పులకి గురవుతారు.
ఒక వ్యక్తి జీవితంలో అలా ప్రభావితమయే ప్రధానాంశాలు చదువు, ఉద్యోగం, పెళ్లే కదా. అయితే ఈ మూడు అంశాలూ ఆడపిల్లలకి ఒక రకం అయితే మగపిల్లలకి మరో రకం. దాన్నే వివక్ష అంటున్నాం.
వీరేశలింగంగారు ఆడవాళ్లకి చదువు కావాలన్నప్పుడు ఆయన ధ్యేయం వేరు. ఆయన పెట్టిన స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ చెప్పే పాఠాలు - సతీధర్మాలు, పతిసేవ, పిల్లల పెంపకం
ఇవి అన్నీ స్త్రీజాతికి ఈనాడు మనం చెప్పుకునే ఆదర్శాలు కావు. ఆయన తరువాత ఇంగ్లీషువాళ్లు పెట్టిన స్కూళ్లలో ప్రధానోద్దేశం ఇంగ్లీషు నేర్పి మనవాళ్లని “నల్లదొర”లుగా మార్చడమే తప్ప వీరేశలింగంగారి..............................