మూడవ ప్రచురణకు ముందు మాట
గొర్రె పిల్లలు తోడేలును ప్రేమిస్తున్నాయని ఎప్పుడైనా విన్నారా? ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా?
ప్రపంచంలోని ఏడు వింతలు అందరికీ తెలిసినవే. ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతం శతాబ్దాల నుండి భారతదేశంలోనే ఉండి సాధారణ కళ్లకు కనిపించలేదు. శిలాస దృశం లాగా నిలిచి వున్న ఆ ఏడు ఆద్భుతాలకు ఎనిమిదో అద్భుతాన్ని ఇంత వరకు ఎవరూ జోడించలేదు. భారతదేశంలో మాత్రమే వున్న ఆ ఎనిమిదో అద్భుతం ఏమిటి? ఈ తోడేలు అమాయకపు బాధిత గొర్రె పిల్లల చేత ప్రేమించబడటంలోని గొప్పతనం ఏమిటి?
ఈ పుస్తకం గుర్తించబడని ఈ మర్మ జీవితో వ్యవహరిస్తుంది. అంతుచిక్కని ఈ జంతువు గొప్పతనం అలాంటిది. ఆ తోడేలు బ్రాహ్మణవాదం. దాని ద్వేషపూరిత తత్వశాస్త్రాన్ని, దాని బాధితులందరూ ప్రేమిస్తారు. ఆరాధిస్తారు, పూజిస్తారు, నెత్తిపై పెట్టుకొని మోస్తారు.
ఈ విషయంపై దాదాపు ఈ 30 ఏళ్లలో తెలుగులో వచ్చిన ఏకైక పుస్తకం ఇదే కావచ్చు. ఎందుకంటే తోడేలు పూర్తిగా మారు వేషంలో ఉంది. శ్రద్ధ, భాగస్వామ్యం వంటి వేషాలను ప్రదర్శిస్తుంది. భారతదేశం వెలుపల ఉన్న గొర్రెలు హింసకు బలవుతుంటారు. కానీ, ఇక్కడ ఉన్న గొర్రెపిల్లలు మాత్రం అహింసకు గురవుతారు. నాలుక కింద దేవుని పేరు, కానీ చంక కింద పిడిబాకు!
స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఆ తర్వాత కూడా ఈ అంశం పై చాలా రచనలు, చాలా చర్చలు జరిగాయి. ప్రముఖులైన బ్రాహ్మణులే బ్రాహ్మణ వాదంపై కఠినంగా వ్యవహారించేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ, బ్రాహ్మణవాదం క్రమంగా దేశంలోని మేధా మరీచికను ఎండగట్టింది. నేడు భారతదేశం విశాలమైన మేధో ఎడారి.......................