ధర్మపురి
రైలువేగం తగ్గడంతో పట్టణ పరిసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇళ్ళు, వీధులు నాటుకుంటూ బండి ముందుకు కదులుతోంది. పట్టాలకు ఇరువైపులా తుమ్మచెట్లు దట్టంగా ఉన్నాయి. స్టేషన్ చేరువ అవుతుంది. భవనాలు రెండుమూడు అంతస్తులు కూడా కనిపిస్తున్నాయి తప్ప ఒకప్పటి చెట్టు, చేమ, పుట్ట అంతగా కనిపించడం లేదు. ఆ రోజుల్లో ఎక్కడో ఒకటి, అర కనిపించే ఇళ్ళు ఇప్పుడు పక్కపక్కనే కనిపిస్తున్నాయి. లుబండి ఇంకో కూత కూసింది. అది స్టేషన్. పట్టాలకు అటు, ఇటు నడిచేవారికి ట్టిగా వినిపించేలా డ్రైవర్ హారన్ వేశాడు. ఆ ప్రాంతం దాటితే బండి స్టేషన్లోకి స్తున్నట్లే. స్లీపర్ క్లాసులో కిటికిలోంచి కళ్ళద్దాలు సవరిస్తూ బయటకు చూస్తున్నాడు స్వామి. ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ఇదే స్టేషన్లో అర్ధరాత్రి బండి ఎక్కిన గుర్తు మదిలో బలంగా ఉంది. ఇంతకాలం తరువాత అదే స్టేషన్లో అడుగుపెడుతుంటే స్వామి నస్సుకు ఏదో తెలియని అనుభూతి. జ్ఞాపకాల దొంతరలు కదులుతున్నాయి. అవి జ్ఞాపకాలు ఏ మాత్రం కావు. కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్ళజోడు కన్నీటిని ఎవరికీ పించనీయడంలేదు. పరుగు వదిలి నడిచిన బండి ఆగిపోయింది.
“స్వామీ, విజయనగరంలో బండి దిగుతామన్నారు,” అన్నాడు తోటి ప్రయాణికుడు. "ఔను, బాబు దిగుతున్నా," అంటూ తన సంచిని పట్టుకుని మిగతా ప్రయాణికులవైపు స్తూ, చిరునవ్వు చిందిస్తూ, గడ్డం ఒకసారి నిమిరి ముందుకు నడుస్తున్నాడు స్వామి. “మీరు ముందు దిగండి స్వామి. ఆ సంచి ఇలా ఇవ్వండి," అంటూ తోటి
మాణికుడు అతనికి సహకరించాడు.
తలుపు దగ్గర ఇరువైపుల ఉన్న రాడ్స్ పట్టుకుని రాజు మొదట అడుగు ప్లాట్ఫాంపై డు. విజయనగరం స్టేషన్లో బండి ఎక్కి, దిగే వారు పెద్దగా లేకపోవడం, పైగా ఈ శ్రీ సుదూర ప్రాంతం నుండి రావడం రాజు ప్లాట్ఫారంపై శాంతంగా అడుగుపెట్టాడు...........................................